DSC 2024 లో గత ప్రభుత్వం 6100 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎన్నికల కారణంతో అది వాయిదా పడింది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి.
అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టులకు మాత్రమే ఒక్కో పోస్టుకు రూ.750 చొప్పున అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.




