AP 10th Telugu 3rd Lesson శతక మాధుర్యం Notes, Sataka Madhuryam Guide Material

ఆ.వె. జ్ఞానుల చరితము వీనుల న
నానుచు సత్పురుష గోష్ఠి ననఘంబనుచున్
బూనుము; ధర్మపథంబును
దానెరిగినయంత; మరువదగదు కుమారా!

— పక్కి అప్పల నరసయ్య

భావం : జ్ఞానుల చరిత్రలను చెవులలోకి ఎక్కించుకోవాలి. అంటే మనసులో పదిలపరచుకోవాలి. పాపాలను పోగొట్టే మంచి వారి స్నేహాన్ని చేయాలి. తెలిసినంత వరకు ధర్మమార్గంలో నడవాలి. ఇవి మరవకూడదు.

ఉద్దేశ్యం: శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది, వారిలో నైతిక విలువలు పెంపొందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

కవి పరిచయం

కవిపేరు : మారద వెంకయ్య
కాలం : 1550 – 1600 మధ్యకాలం
ఇతర పేర్లు : ఈయనను మారన వెంకయ్య, మారవి కవి అని కూడా అంటారు.
రచనలు : భాస్కర శతకం
ప్రత్యేకత : తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకంగా భాస్కరశతకం పేరు పొందింది. దృష్టాంతము అంటే ఉదాహరణ అని అర్ధం. కవి చెప్పదలచుకున్న నీతిని ఉదాహరణతో చెప్పడం వలన నీతిబోధ స్పష్టంగా, సులువుగా అవగాహన అవుతుంది.

శతక మాధుర్యం Sataka Madhuryam Guide PDF

PDF
శతక మాధుర్యం Sataka Madhuryam Guide PDF
Click Here

Aasvika Reddy

Aasvika Reddy is an Associate Manager- Content Writer, with over 3 years of experience in Education content writing. She holds an B.Tech. in Computer Science. Aasvika's primary responsibility is to produce and analyse high-quality content educating and informing the aspirants about upcoming government exams published on our website.